బాలయ్య ‘పీఏ’కు మూడేళ్ల జైలు శిక్ష


సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య మాజీ పీఏ జైలు పాలయ్యాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనకు నెల్లూరు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. దాంతోపాటు మూడు లక్షల జరిమానా విధించింది.

శేఖర్ చాన్నాళ్లు బాలకృష్ణ పీఏ గా పని చేశారు. ఆయన బాలయ్యకు బినామీ అనే ప్రచారం కూడా ఉంది. ఇక, బాలకృష్ణ రెండోసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఎమ్మెల్యేగా హిందూపురం ప్రజలకి సేవ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు బాలయ్య. ఆయన తాజా చిత్రం కె. యస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.