థమన్’ని భరించడం కష్టమట.. !

టాలీవుడ్ డిమాండ్ వున్న ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లు దేవిశ్రీ ప్రసాద్, ఎస్. ఎస్ థమన్. ఐతే, వీరిలో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్టు అనిపించుకొన్నాడు. తొలిప్రేమ, అరవింద సమేత, మజిలీ.. సినిమాలకు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. సినిమాని స్థాయిని పెంచాడు. ప్రస్తుతం అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం థమన్ హవా నడుస్తోంది. ఐతే, థమన్ ని భరించడం కష్టమట.

థమన్ తరచు చెన్నయ్ నుంచి హైదరాబాద్ వస్తారట. పార్క్ హయాత్ లోనే వుంటారట. అది కూడా ఖరీదైన సర్వీస్ అపార్ట్ మెంట్ లోనే. వేరే హోటల్ అన్నా, గెస్ట్ హవుస్ అన్నా అంగీకరించరు. హాయిగా సాయంత్రం వేళ తన నేస్తాలతో క్రికెట్ ఆడుకుంటూ, మధ్యలో సినిమా పని చూసుకుంటూ వుంటారట. కోటి నుంచి కోటిన్నర తీసుకుంటారట. ఇదంతా నిర్మాతలకి భారం అవుతుంది. పార్క్ హయాత్ బిల్లులు చెల్లించడం తలకుమించిన భారం అవుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే, ఇదంతా ప్రచారం మాత్రమే అసలు నిజం ఏంటన్నది తమన్ అండ్ టీమ్ కే తెలియాలి.