బిగ్ బాస్ వివాదంపై హేమ కామెంట్

బిగ్ బాస్ తెలుగు సీజన్3 త్వరలోనే ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఐతే, బిగ్ బాస్3 ప్రారంభానికి ముందే వివాదాలు తలెత్తాయ్. కంటెస్టెంట్స్ గా ఫైనల్ చేసి చివరి నిమిషంలో మోసం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు, బిగ్ బాస్ కు సెన్సార్ చేయాల్సిందే. సెన్సార్ చేసిన తర్వాతే బిగ్ బాస్3ని ప్రసారం చేయాలనే డిమాండ్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో నటి హేమ బిగ్ బాస్3 పై స్పందించారు.

“అనవసరంగా బిగ్ బాస్ షో పై వివాదాలు క్రియేట్ చేయవద్దు. నాగార్జున ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.
నిజంగానే బిగ్ బాస్ షో వేధింపులు ఉంటే.. నాగ్ షోలో అడుగు పెట్టరు” అని చెప్పుకొచ్చింది. ఇక, రాజకీయ జీవితంపై హేమ స్పందించారు. ఇకపై పూర్తిస్థాయి రాజకీయాలు చేస్తానన్నారు.