ఐసీజే తీర్పు : కుల్‌భూషణ్‌ మరణశిక్ష నిలిపివేత


నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ విధించిన ఉరిశిక్షను నిలిపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు వెలువరించింది. ఐసీజేలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చారు. తాము తుది తీర్పు ఇచ్చేవరకూ మరణశిక్ష అమలును నిలిపివేయాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది.

కుల్‌భూషణ్‌ 2016లో పాకిస్థాన్‌ భద్రతా దళాలకు చిక్కిడు. ఆయన గూఢచౌర్యానికి, ఉగ్రవాదానికి పాల్పడ్డారంటూ ఆ దేశ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే ఏడాది మే 8న ఐసీజేను ఆశ్రయించింది. ఆయన ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటుండగా అక్రమంగా నిర్బంధించారని తెలిపింది.

గత ఫిబ్రవరిలో కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో విచారణ చేపట్టిన ఐసీజే ఉభయ దేశాల వాదనలను వింది.  తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం మళ్లీ విచారణ చేపట్టి.. కుల్‌భూషణ్‌ మరణశిక్షను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది.