‘బాహుబలి’ రేంజ్ లో ‘మిస్టర్ కేకే’ ఉంటాడా ?


విలక్షణ నటుడు విక్రమ్ తాజా చిత్రం ‘కదరమ్‌ కొండన్‌’. తెలుగులో ‘మిస్టర్‌ కేకే’గా తీసుకొస్తున్నారు. రాజేష్‌ ఎం.సెల్వ దర్శకుడు. అక్షర హాసన్‌, అభిహాసన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని టి.నరేష్‌కుమార్‌, టి.శ్రీధర్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 19న మిస్టర్ కేకే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న విక్రమ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకొన్నారు. “మిస్టర్‌ కేకే’ ఒకరోజులో జరిగే కథ. కొన్ని సన్నివేశాల కోసం చాలా రిస్క్‌ చేశాం. ‘టైటానిక్‌’, ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’, ‘బాహుబలి’ లాగా ఇందులోని థ్రిల్లింగ్‌ అంశాలు ఉంటాయి’ అన్నారు విక్రమ్. అంతేకాదు.. ‘కేకే’ పాత్రని కమల్‌ హాసన్‌ చేయాలి. కానీ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నందున విక్రమ్ చేశారట. అందుకే ఛాలెంజిగా తీసుకొని చేశారట.

విక్రమ్ తెలుగువాడే. కెరీర్ ప్రారంభంలో పలు తెలుగు సినిమాల్లో నటించాడు. ఐతే, ఆయనకి తమిళ్, మలయాళ చిత్రాలు నటుడుగా గుర్తింపు తెచ్చాయి. అవి తెలుగులో డబ్ అయి.. ఇక్కడ మంచి విజయాన్ని అందుకొన్నాయి.