‘సాహో’ 15రోజులు వెనక్కి ?


సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో సాహోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులు సాహో కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో షూటింగ్ పూర్తయింది. మరోవైపు, పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జెడ్ స్వీడుతో సాగుతున్నాయి. అయినా.. ఆగస్టు15న రావాల్సిన ‘సాహో’ వాయిదా పడక తప్పదని అంటున్నారు.

రిలీజ్ డేటు లోపు వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తయ్యేలా లేవని సమాచారమ్. హడావుడిగా చేస్తే అవుట్ ఫుట్ సక్రమంగా ఉండదని భావించిన నిర్మాతలు భావిస్తున్నారంట. ఈ నేపథ్యంలో 15రోజులు ఆలస్యంగా ఆగస్టు 30న ‘సాహో’ని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించారు. దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. యూవీ క్రియేషన్స్ నుంచి వస్తున్న తొలి భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం.