సరిలేరు నీకెవ్వరు.. ఓ మిక్షర్ పొట్లం ?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు – అనిల్ సుంకర్ – మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం కశ్మీర్ లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమా ఓ మిక్షర్ పొట్లం అనే ప్రచారం జరుగుతోంది. మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాలు ‘పోకిరి+దూకుడు’ కలిపితే సరిలేరు నీకెవ్వరు కథ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దూకుడు తరహా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు పోకిరి స్టయిల్ హీరోయిజం ఉండనుండని చెబుతున్నారు. ఈ రెండింటిని దర్శకుడు అద్భుతంగా చూపించబోతున్నాడట.

ఈ ప్రచారం మహేష్ అభిమానులని ఏమాత్రం భయపెట్టడం లేదు. ఎందుకంటే ? టాలీవుడ్ గ్రేట్ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్సే. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 దేనికదే ప్రత్యేకమైనది. ప్రతి సినిమాని వినోదాత్మకంగా డీల్ చేసి ప్రశంసలు అందుకొన్నారు. సరిలేరు నీకెవ్వరు కూడా కథాబలంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా చెబుతున్నారు. సో.. సరిలేరు నీకెవ్వరు మిక్షర్ పొట్నం అనే ప్రచారంపై మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పనిలేదేమో.. !