విజయ్ బిజినెస్ పార్ట్నర్’గా రస్మిక !


టాలీవుడ్ సన్సేషన్ విజయ్ దేవరకొండ బిజెనెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘కింగ్ ఆఫ్ హిల్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ బ్యానర్ నుంచి తొలి సినిమాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న సినిమా రాబోతుంది. మరోవైపు, ‘రౌడీ’ బ్రాండ్ పేరుతో బట్టల బిజినెస్ కూడా చేస్తున్నాడు విజయ్. యూత్ ఇష్టపడే దుస్తులని తీసుకొస్తున్నారు. త్వరలో ఆడవాళ్ల కోసం రౌడీ డ్రెస్సులని తీసుకురానున్నాడు.

ఇందుకోసం హీరోయిన్ రష్మిక మందనని బిజినెస్ పార్ట్నర్ గా తీసుకొన్నట్టు తెలుస్తోంది. లేడీ రౌడీ బ్రాండ్ ని ప్రచారం చేసే బాధ్యతని రస్మిక అప్పగిస్తాడని చెప్పుకొంటున్నారు. విజయ్-రస్మిక కలిసి నటించిన తొలి చిత్రం ‘గీత గోవిందం’ సూపర్ హిట్ అయింది. ఇందులో వీరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. గీత గోవిందం ఏకంగా వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా తర్వాత వెంటనే డియర్ కామ్రేడ్ కోసం విజయ్-రస్మిక మరోసారి జతకట్టారు. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా సమయంలో విజయ్ రస్మికని ప్రత్యేకంగా చూసుకొన్నాడు. ఆమెపై ఈగ కూడా వాలనీయలేదు. వీరిద్దరి ప్రేమలో పడినట్టు అనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే రస్మికని తన బిజినెస్ పార్ట్నర్ గా చేసుకొన్నాడు విజయ్. ఆ తర్వాత లైఫ్ పార్ట్నర్ గా చేసుకొనే అవకాశాలు లేకపోలేదని టాక్. దానికి కాలమే సమాధానం చెప్పాలి మరీ.. !