‘డియర్ కామ్రేడ్’ ఆంథమ్.. అదిరిపోయింది !


టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మందన కథానాయిక. కొత్త భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. దక్షిణాది అన్ని బాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ) ఈ నెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు ఆయా భాషల్లో జనాల్లోకి తీసుకెళ్లడం కోసం విజయ్ ఎంత చేయాలో అంతా చేస్తున్నారు.ఇప్పటికే బెంగుళూరు, కోచ్చిలో ఫంక్షన్ లు చేసి, హీరోయిన్ రష్మికతో కలిసి హల్ చల్ చేశారు.

అంతేకాదు.. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ హీరోలతో డియర్ కామ్రేడ్ ఆంథమ్ ని పాడించారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో విజయ్ సేతుపతి ఆ పాటను పాడగా, తెలుగులో విజయ్ దేవరకొండనే పాడేశాడు. తాజాగా డియర్ కామ్రేడ్ తెలుగు ఆంథమ్ ని విడుదల చేశారు. విజయ్ కేక పెట్టించాడు. అద్భుతంగా పాడాడు. మీరు వినేయసేండీ.. !