హైదరాబాద్’లో వెంకీ మామ సందడి !


బాబీ దర్శకత్వంలో వెంకటేష్‌, నాగచైతన్య కలసి నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీ ఖన్నా నాయికలు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి. గురువారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలైంది. వెంకీ, చైతూలపై కొన్ని కీలక సన్నివేశాల్నితెరకెక్కిస్తున్నారు.

‘వెంకటేష్‌, నాగ చైతన్యలను ఒకేసారి వెండి తెరపై చూడడం అభిమానులకు కనుల విందుగా ఉంటుంది. వాళ్ల పాత్రల్ని కూడా చక్కగా తీర్చిదిద్దాం. కుటుంబ బంధాలతో సాగే వినోదాత్మక కథ ఇది. ఎవరి ఊహకూ అందని కొత్త అంశాలూ ఉన్నాయ’ని చిత్రబృందం తెలిపింది. ‘ఎఫ్2’ తర్వాత వెంకీ, ‘మజిలీ’ తర్వాత చైతూ నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతికి ‘వెంకీ మామ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.