షీలా దీక్షిత్‌ ఇకలేరు !


కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కన్నుమూశారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. కొన్నాళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో కొద్దిసేపటిక్రితమే తుదిశ్వాస విడిచారు .1938 మార్చి 31న జన్మించిన ఆమె 15 ఏళ్ల పాటు దిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు.