సురవరం స్థానంలో డి. రాజా

సురవరం సుధాకర్‌ రెడ్డి సీపీఐ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి వైదొలిగారు. అనారోగ్య కారణాల వల్లే తాను బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సురవరం ప్రకటించారు. ఆయన స్థానంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.రాజా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్‌తో పాటు, ఒడిశాకు చెందిన యువ నాయకుడు రామకృష్ణ పండాను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు.

తమిళనాడుకు చెందిన డి.రాజా 1985లో సీపీఐ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. తమిళనాడులో పలు ఉద్యమాలకు నేతృత్వం వహించారు. 1995 నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సురవరం తప్పుకోవడంతో ఆయన స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాజా నాయకత్వంలో పార్టీ పురోగమిస్తుందని సురవరం విశ్వాసం వ్యక్తంచేశారు.