‘ఇస్మార్ట్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ ఎప్పుడంటే ?


చాన్నాళ్ల తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ‘టెంపర్’ సినిమా తర్వాత పూరి హిట్ లేదు. ఆయనతో సినిమా చేసేందుకు స్టార్స్ ఎవరు ఆసక్తి చూపడం లేదు. రెండో గ్రేడ్ హీరోలు కూడా పూరి పేరు చెబితే మొహం చాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరి కసితో చేసిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో ఎనర్జిటిక్ హీరో రామ్ మరింత ఎనర్జిటిక్ గా చూపించాడు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. తొలిరోజు వెయ్యి థియేటర్స్ లో ఇస్మార్ట్ శంకర్ హౌస్ ఫుల్. హిట్ టాక్ తో రెండో, మూడో రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. ఇప్పటికే కలెక్షన్స్ రూ. 25కోట్లు దాటేశాయ్.

కేవలం రూ. 15కోట్లకు అమ్ముడుపోయిన ఇస్మార్ట్ శంకర్ అప్పుడే లాభాల బాట పటింది. ఈ సక్సెస్ ని చిత్రబృందం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. వీరికి పూరి గురువు రామ్ గోపాల్ వర్మ కూడా తోడయ్యాడు. ఇస్మార్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్ పేరిట రచ్చ రచ్చ చేస్తున్నాడు. పనిలో పనిగా ఛార్మిని కిస్సులు, హంగులతో వాడేస్తున్నాడు. సక్సెస్ సెలబ్రేషన్స్ ముచ్చట్లు పక్కనపెడితే.. ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ సమయంలో.. సీక్వెల్ ప్రకటించాడు పూరి. ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తానని తెలిపారు. ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో భాగంగా సీక్వెల్ పై మరింత క్లారిటీ ఇచ్చారు పూరి. తనకు కొన్ని ఐడియాస్ ఉన్నాయని, ఆ ఆలోచనలన్నీ క్రోడీకరించి డబుల్ ఇస్మార్ట్ తీసుకొస్తానని తెలిపారు. అంతకంటే ముందు రెండు 2నెలలపాటు పూరి విశ్రాంతి తీసుకోనున్నాడు. ఆ తర్వాతే తదుపరి సినిమా.