గబ్బర్ ఈజ్ బ్యాక్

ప్రపంచకప్ లో గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తిగా కోలుకొన్నాడు. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్‌ పర్యటనకు ధావన్ సిద్ధంగా ఉన్నాడని సమాచారమ్. ఇవాళ వెస్టిండీస్‌ టూర్‌కు జట్టుని ప్రకటించే నేపథ్యంలో అతడికి స్థానం లభించే అవకాశముంది. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో గబ్బర్‌ చేతివేలికి గాయమైన విషయం తెలిసిందే.

లీగ్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధావన్ వేలికి గాయమైంది. ప్యాట్‌కమిన్స్ బౌలింగ్‌లో గాయపడిన ధావన్ నొప్పిని ఓదార్చుకొని మరీ శతకం(117; 109 బంతుల్లో) బాదాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగులతో విజయం సాధించింది. గాయం తీవ్రమైంది కావడంతో.. ధావన్ ప్రపంచకప్ నుంచి మధ్యంతరంగ వైదొలగక తప్పలేదు. ధావన్ స్థానంలో రిషభ్ పంత్ కి అవకాశం దక్కింది. నాల్గో స్థానంలో ఆడిన రిషభ్ పర్వాలేదనిపించాడు.