స్వర్ణలత భవిష్యవాణి : వర్షాలు కురుస్తాయ్

ఈ యేడాది అమ్మవారు ఖుషి అయింది. బోనాల ఉత్సవాలపై సంతోషం వ్యక్తం చేసింది. ఆనవాయితీ ప్రకారం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ‘రంగం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. వర్షాలు తప్పకుండా కురుస్తాయని భరోసా ఇచ్చారు. ప్రజలందరినీ సుఖసంతోషాలతో చూస్తానని అమ్మవారు మాటిచ్చారు.

“నా బిడ్డలను సంతోషంగా ఉంచే బాధ్యత నాదే. నాకు పూజలెందుకు ఆపుతున్నారు. బోనం మాత్రం తప్పకుండా సమర్పించాలి. ప్రజలందరినీ సుఖసంతోషాలతో చూస్తానని మాటిస్తున్నాను. గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయండి. అమ్మవారు కరుణించి ప్రజల కోరికలు తీరుస్తుంది. ఐదువారాలపాటు పప్పు, బెల్లంతో శాఖలు సమర్పించండి. మారు బోనం తప్పకుండా సమర్పించండి.. ఎలాంటి ఆపద రానివ్వను’’ అని భవిష్యవాణి వినిపించారు. భక్తులు సమర్పించిన ముడుపులను సంతోషంగా అందుకున్నానన్నారు.