మహేష్ సినిమాని వదులుకొనేందుకు దిల్ రాజు రెడీ ?

సూపర్ స్టార్ మహేష్ సినిమాపై దిల్ రాజు అనాస్తికి చూపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘మహర్షి’ సినిమా తర్వాత వంశీపైడి పల్లి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు మహేష్ మాటిచ్చాడు. అది కూడా ఈ యేడాదియే. చివర్లో ప్రారంభం కానుంది. పివిపి-దిల్ రాజు సంయుక్తంగా నిర్మించాల్సి ఉంది. ఐతే, ఇప్పుడీ ఈ సినిమాని వదిలేసుకొనేందుకు దిల్ రాజు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ? మహేష్ సినిమాకు లాభాలు రావడం కష్టమని ఆయన భావిస్తున్నారు.

దాదాపు రూ. 150కోట్ల బడ్జెట్ వచ్చిన ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ, నిర్మాతలకి ఏం మిగలలేదు. పైగా నష్టాలు చూడాల్సి వచ్చింది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చిన మొత్తం మహేష్ ఖాతాలోకే వెళ్తుంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చిన మొత్తంలోనే నిర్మాత లాభాలు తీసుకోవాలి. మహేష్ 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాకు రూ. 100కోట్లుకు పైగా బడ్జెట్ ఖర్చుపెట్టనున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు సహ నిర్మాత. అనిల్ సుంకర్, మహేష్ లతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా పెద్దగా మిగిలేది లేదని ఇప్పటికే దిల్ రాజుకి క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వంశీ-మహేష్ సినిమాని వదులుకొనేందుకు దిల్ రాజు రెడీ అయినట్టు సమాచారమ్. తెలిసిన నిర్మాతల దగ్గర మహేష్ సినిమా చేస్తారా ? సెట్ చేస్తానని దిల్ రాజు అంటున్నారు. డివివి దానయ్య, ఆసియన్ సునీల్ వంటి నిర్మాతలు మహేష్ సినిమాని తీసుకొనే ఛాన్స్ ఉంది. వంశీ-మహేష్ కాంబోలో రెండో సినిమా పక్కా. ఐతే, నిర్మాతగా ఎవరు ఉంటారన్నదే తెలియాల్సిఉంది.