‘కథనం’ రిలీజ్ డేటు వచ్చేసింది


అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్ల దర్శకుడు. ఈ చిత్రంలో ధనరాజ్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేటుని ప్రకటించింది చిత్రబృందం. ఆగస్టు9న ‘కథనం’ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ డేటు పోస్టర్ విడుదల చేశారు.

ఇదో క్రైమ్ థిల్లర్. ఇందులో అనసూయ అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపించనుంది. ఆగస్టు9న కథనం విడుదల చేయడం సాహాసమే అని చెప్పాలి. జులై 26న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ రానుంది. ఇక, ఆగస్టు 15న మన్మథుడు 2 రాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య కథనం విడుదల కానుంది. ఒక్కవారంలోనే భారీ కలెక్షన్స్ వసూలు చేసే సినిమా కథనం కాదు. ఈ నేపథ్యంలో కథనం ఎంత బాగున్నా.. డ్యామేజ్ తప్పదని చెబుతున్నారు.