సాహో కొత్త పోస్టర్ : రొమాంటిక్ మూడ్’లో ప్రభాస్


సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో సాహోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులు సాహో కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు15న రావాల్సిన ‘సాహో’ ఆగస్టుకి30కి వాయిదాపడిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ప్రభాస్-శ్రద్దా కపూర్ రొమాంటిక్ మూడులో ఉన్నారు. సాహో.. ఓ యాక్షన్ థ్రిల్లర్. అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. ఇందుకోసం ఏకంగా రూ.90కోట్లు ఖర్చు చేశారు. దుబాయ్ లో తీసిన యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్ ఉండబోతుందని చెబుతున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రొమాన్స్ మిస్ కాలేదని చెప్పడానికి తాజా పోస్టర్ విడుదల చేసినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.