అది.. విజయ్’కి పిచ్చిగా నచ్చిన కథ !


‘పెళ్లి చూపులు’ సినిమా విజయ్ దేవరకొండని హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ తో క్రేజీగా మారాడు విజయ్. ‘గీత గోవిందం’ హిట్ తో ఏకంగా స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.ఐతే ‘పెళ్లి చూపులు’ సమయంలో ఓ కథ విజయ్’కి బాగా నచ్చింది.
కానీ అప్పుడు చేయలేకపోయాడు. ఇప్పుడీ ఈ కథ తనకి కరెక్ట్ కాదు. ఆ కథపై విజయ్ కి ఇంకా నమ్మకం ఉందట. అందుకే ఆ సినిమా కి విజయ్ నిర్మాతగా మారాడు. త్వరలోనే తెరకెక్కించనున్నారు. మరీ.. విజయ్ పిచ్చిగా నచ్చిన కథలో హీరోగా నటించేది ఎవరన్నది తెలియాల్సి ఉంది.

ఇక, విజయ్ తాజా చిత్రం డియర్ కామ్రేడ్ ఈ వారమే (జులై26) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. రష్మిక మందన కథానాయిక. మైత్రీ మూవీస్ నిర్మించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని బాధ్యతలని విజయ్ తన భుజాలపై వేసుకొని చేశారు. సినిమాని జనాల్లోకి తనదైన శైలిలో తీసుకెళ్లారు. ఇష్టమైనది పోరాడైనా దక్కించుకోవాలన్న కథాంశంతో డియర్ కామ్రేడ్ తెరకెక్కింది.