బీజేపీలోకి వివేక్.. పక్కా !


మాజీ ఎంపీ వివేక్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం పక్కా అయింది. ఆయన ఈరోజు ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలిశారు. వాస్తవానికి ఈరోజే వివేక్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఐతే, ఆషాడం ముగిసిన తర్వాత పార్టీ మారతానని వివేక్ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని ఆశించారు వివేక్. ఆయన కోరికని తెరాస తీర్చలేదు. దీంతో అలకబూనని వివేక్ కాంగ్రెస్ వైపు చూశారు. తెరాస ప్రభుత్వం తీసుకొన్న సచివాలయం కూల్చివేతని వ్యతిరేకించారు. ఇతర నేతలతో కలిసి ఉద్యమం చేశారు. కాస్త లైవ్ లోకి రాగానే ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో చేరడంపై పక్కా చేసుకొన్నారు. ఆషాడం వెళ్లగానే ఆయన కమలం గూటికి చేరనున్నారు.

ఇక, తెలంగాణ కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్లు బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెరాస సీనియర్ నేత డీఎస్ తదితరులు బీజేపీలో చేరతారనే ప్రచారం ఉంది.