గుణ369 సెన్సార్ రిపోర్ట్


కొత్త దర్శకుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తీకేయ నటించిన చిత్రం ‘గుణ369’. అన‌ఘ కథానాయిక. స్నేహితుడి కోసం గొడ‌వ మొద‌లుపెట్టి.. చివ‌రికి ఆ గొడ‌వ ఎంత‌దూరం వెళ్లింది. ఎలాంటి న‌ష్టం తీసుకొచ్చిందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఆగస్టు2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది.

అర్జున్ జంధ్యాల మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను శిష్యుడు. ఆయన గురువు స్టయిల్ లోనే ‘గుణ369’ చిత్రాన్ని మాస్ ప్రేక్షకులని దృష్టిపెట్టుకొని తీసినట్టు టీజర్ తో అర్థమయింది. ప్రపంచంలో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథని రాసుకొన్నట్టు దర్శకుడు తెలిపారు. సినిమా చాలా సహజంగా ఉండనుందని తెలిపారు. ఈ చిత్రానికి అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు.