‘మన్మథుడు 2’ ట్రైలర్ టాక్


రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో కింగ్‌ నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సమంత, కీర్తి సురేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. మన్మథుడు 2 పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ట్రైలర్ తో అర్థమవుతోంది.

‘అద్భుతం, ఆమోగం.. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. ఐయామ్ ఇగో..’ అంటూ నాగ్ కారులో వెళ్తూ సంబరపడిపోవడంతో ట్రైలర్ ప్రారంభం అయింది. ‘ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను’ అంటూ నాగ్ రకుల్ తో చెప్పిన డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత నాగ్ తో రకుల్ కు సంబంధించిన పెళ్లి ముచ్చట్లు, ఏర్పాట్లతో ఫ్యామిలీ బిట్ సీన్స్ చూపించారు. ఆ తర్వాత రొమాంటిక్ బిట్ సీన్స్, ఓ యాక్షన్, ఏమోషన్స్ సీన్స్ ట్రైలర్ ఆకట్టుకొనేలా ఉంది.

చివర్లో ‘నీ కృష్ణావతారం అయిపోంది. ఇక రామవతారం స్టార్ అంటున్నా’ వెన్నెల కిషోర్ తో చెప్పించారు. మొత్తంగా.. మన్మథుడు తరహా మంచి టైమింగ్ తో కూడిన వినోదం మన్మథుడు 2లో ఉండబోతుందని ట్రైలర్ తో అర్థమవుతోంది. ఐతే, మన్మథుడు కథతో రెండో మన్మథుడుకి పోలికలు ఉండవిని ట్రైలర్ రిలీజ్ వేడుకలో నాగ్ తెలిపారు.