రేపు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు

జైపాల్‌ రెడ్డి మృతి దేశానికి తీరని లోటు అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆయన ఈ ఉదయం జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమట్ రెడ్డి.. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు, స్మారక చిహ్నానికి తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించాలి. స్మారక చిహ్నం నిర్మాణానికి వీలుగా స్థలం కేటాయించాలి. స్థలం కేటాయింపుపై తెలంగాణ సీఎస్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామన్నారు. రేపు మధ్యాహ్నం జైపాల్ రెడ్డి అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపినట్టు వెంకట్ రెడ్డి తెలిపారు. ఇక, సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి మృతిపట్ల సంతాపం తెలియజేశారు.