బ్రేకింగ్ : స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ రాజీనామా


కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకొన్నారు. తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక రాజకీయ సంక్షోభంలో స్పీకర్ రమేష్ కుమార్ యావత్ దేశాన్ని ఆకట్టుకొన్నారు. పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అసమ్మతి ఎమ్మెల్యేలపై కొరడా ఝుళిపించారు. మొత్తం 17 మంది సభ్యులపై అనర్హత వేటు వేశారు.

ఇక బల పరీక్షలో కమలనాథులు నెగ్గిన కాసేపటికే స్పీకర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ అనూహ్య నిర్ణయానికి సభలోని సభ్యులందరినీ షాక్‌కు గురిచేశారు. దీంతో తాత్కాలిక స్పీకర్‌గా కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. రాజీనామా తర్వాత రమేష్ కుమార్ బాగోద్వేగంతో మాట్లాడారు. ’14నెలల 4 రోజుల పాటు నేను స్పీకర్‌గా పనిచేశాను. నన్ను అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒక స్పీకర్‌లా కాకుండా ప్రజల కోణంలో ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకున్నాను. నా విధిని 100% నిర్వర్తించానని గర్వంగా చెప్పుకోగలను. నా మాటలు, చేతల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మన్నించండి’ అన్నారు.