‘రణరంగం’ సాంగ్ : కాజల్ పిక్చర్ పర్ఫెక్ట్

శర్వానంద్- సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. ఇందులో శర్వా రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రణరంగం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ‘పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్.. ’ విడుదల చేశారు. కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ పాటను నిఖితా గాంధీ ఆలపించారు. సన్నీ ఎం.ఆర్. స్వరపరిచారు. శర్వానంద్ – కాజల్ లపై ఈ పాటను చిత్రీకరించారు. పాటకు తగ్గట్టుగా ఇందులో కాజల్ పిక్చర్ ఫర్ ఫెక్ట్ గా ఉంది. చందమామ అందాలతో కనువిందు చేసింది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో ఒకటి కాకినాడలో మరొకటి హైదరాబాద్ లో నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఆగస్టు4న కాకినాడ ఫంక్షన్ జరగనుంది.