రెండు చోట్ల రణరంగం


సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన చిత్రం ‘రణరంగం’. ఇందులో శర్వా రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఈ రెండు షేడ్స్ కు ఇద్దరు హీరోయిన్లు గా కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది.
ఆగస్టు 15న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 4 రణరంగం ప్రీ రిలీజ్ వేడుకని కాకినాడలో ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో కీలక ఎపిసోడ్ లు అన్నీ కాకినాడ పోర్టులో షూట్ చేయడం జరిగింది. దీనికితోడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ పేరెంటల్ కంపీనీ హారిక హాసిని యూనిట్ ప్రస్తుతం కాకినాడలోనే వుంటుంది. బన్నీ-త్రివిక్రమ్ సినిమా షూట్ అక్కడ రెండువారాల పాటు జరగనుంది. అందుకే అన్ని విధాలా బాగుంటుందని ‘రణరంగం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి కాకినాడలో ప్లాన్ చేస్తున్నారు.

కాకినాడతో పాటుగా హైదరాబాద్ లోనూ రణరంగం ప్రీ రిలీజ్ వేడుక ఉండనుంది. దాన్ని సినిమా విడుదలకి ఒకట్రెండు రోజుల ముందు ఉండేలా ప్లాన్ చేయనున్నారు. ఇక, రణరంగం విడుదలకి ఒకవారం ముందు మన్మథుడు2, రెండు వారాల తర్వాత సాహో విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో రణరంగం బాగుంటేనే బయటపడగలదు. లేదంటే.. డ్యామేజ్ తప్పదు.