మహేష్ కోసం సోనీ ?


సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన ఫ్యాన్స్ ని కాలరెగిరేసేలా చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ‘మహర్షి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఈ సినిమా సక్సెస్ ని మహేష్ మస్త్ గా ఎంజాయ్ చేశాడు. ఈ ఆనందంలో వంశీతో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు. అది కూడా వెంటనే. ప్రస్తుతం మహేష్26 ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఆ తర్వాత మహేష్ 27 వంశీ దర్శకత్వంలోనే ఉండనుంది. మహేష్-వంశీ పైడిపల్లి సినిమాను తాను సోలోగా నిర్మించాలని నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సోలోగా చేయాలంటే పివిపి అడ్డంకి వుంది. వంశీ పైడిపల్లికి పివిపితో కమిట్ మెంట్ వుంది. మరి ఆ కమిట్ మెంట్ ను ఏ విధంగా సెటిల్ చేసుకుంటారనేది చూడాలి. మరోవైపు, ఈ ప్రాజెక్టులోకి సోనీ లాంటి బడాసంస్థను తీసుకురావాలని పివిపి ప్రయత్నిస్తున్నట్టు సమాచారమ్. సోనీ ఎంటర్ అయితే దిల్ రాజు, పివిపిలు సైడ్ అవుతారా ? సోనీతో కలిసి కాంబినేషన్ త్రీగా మహేష్27ని నిర్మిస్తారా ? అన్నది చూడాలి.

ఇక మహేష్26 ‘సరిలేరు నీకెవ్వరు’ కశ్మీర్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొంది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఇందుకోసం భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర్-దిల్ రాజు-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.