మన్మథుడు 2 కథనం దెబ్బతీయనుందా ?


మన్మథుడు 2 పై కథనం ఎఫెక్ట్ గట్టిగా పడేలా కనిపిసోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య మన్మథుడు 2 ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున అనసూయ ‘కథనం’ కూడా రిలీజ్ కానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ టీజర్, ట్రైలర్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. కథ-కథనం అద్భుతంగా కుదిరినట్టు అర్థమవుతోంది. దీంతో మన్మథుడు 2పై కథనం ఎఫెక్ట్ పడేలా ఉంది.

హాట్ యాంకర్ గా బుల్లితెరని ఏలుతున్న అనసూయని ‘సోగ్గాడు చిన్ని నాయన’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత క్షణం, రంగస్థలం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’తో నాగార్జునతో ఫోటికి దిగనుంది. అంతేకాదు.. మన్మథుడు 2కి గట్టిపోటి ఇచ్చేలా కనిపిస్తోంది. ‘కథనం’కు ఎన్‌. రాజేశ్ దర్శకత్వం వహించారు. అవసరాల శ్రీనివాస్‌, ధనరాజ్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్‌ సంగీతం సమకూర్చారు.