‘ఎవరు’ ట్రైలర్ టాక్


కథానాయకుడు, రచయితగానూ రాణిస్తున్నారు అడవి శేష్. క్షణం, గూఢాచారి సినిమాల కోసం తన కలం బలం చూపించారు. ఆయన తాజా చిత్రం ‘ఎవరు’. రెజీనా కథానాయిక. వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. పీవీపీ సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరు, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నేలు నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.

రెజీనాని రేప్ చేస్తున్నట్టుగా బిట్ సీన్ తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత ఏదో మర్డర్ కేసు గురించి అడవి శేష్ ఇన్విస్టేటింగ్… సస్పెన్స్ తో కూడిన బిట్ సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథ, కథనాలతో సినిమా తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇంతకీ హత్య చేసింది ఎవరు ? ఎందుకు ?? అనేది ఈ నెల 15న థియేటర్స్ లో చూసి తెలుసుకోవాల్సిందే.