ఢిల్లీలో ప్రమాదం.. 6గురు మృతి !


దేశ రాజధాని ఢిల్లీ జకీర్‌నగర్‌ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ నాలుగు అంతస్తుల భవనంలో మంగళవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఓ విద్యుత్తు బాక్స్‌లో జరిగిన షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో చాలా మంది గాఢనిద్రలో ఉండటంతో మరణాలు సంభవించాయని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.