‘సాహో’ ఓవర్సీస్ రేటెంతో తెలుసా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది. అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన మూడో భారతీయ సినిమాగా సాహో రికార్డు సృష్టించింది. ఐతే, ఏయే బాషలో ఎంత రేటు పలికింది అన్న వివరాలు ఇంకా బయటకురాలేదు. బాలీవుడ్ లో ‘సాహో’ని టీ సిరీస్ విడుదల చేస్తోంది. ఓవర్సీస్ హక్కులని
ఫార్ ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. ఈ హక్కుల కోసం ఫార్ ఫిలిమ్స్ ఏకంగా 40కోట్లకు పైగా చెల్లించిందని సమాచారమ్.

సుజీత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కింది. ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ జతకట్టనుంది. ఆమెకి ఇదే తొలి తెలుగు చిత్రం. నీల్ నితిన్ ముకేశ్ , అరుణ్ విజయ్ , మురళి శర్మ , వెన్నల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని దాదాపు రూ. 300కోట్లకిపైగా బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 30సాహో విడుదల కానుండటంతో.. పలు సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో సాహోకు అన్నీ బాషల్లోనూ అత్యధిక సంఖ్సలో థియేటర్స్ దక్కాయి. ఈ నేపథ్యంలో వాయిదాపడిన సినిమాల దర్శక-నిర్మాతలకి యూవీ క్రియేషన్స్ థ్యాంక్స్ చెబుతూ ఓ ప్రెస్ నోట్ ని విడుదల చేసింది.