చల్లపల్లి హాస్టల్ హత్య కేసులో షాకింగ్ నిజాలు

కృష్ణాజిల్లా చల్లపల్లి వసతిగృహంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆదిత్య అంత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. బాత్ రూమ్ లో రక్తపుమరకలతో ఆదిత్య మృతదేహం పడివుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ హత్య కేసుని పోలీసులు చేధించారు. ఆదిత్యని చంపింది పదో తరగతి విద్యార్థిగా గుర్తించారు. అతడు పెన్సిల్ చెక్కే బ్లేడ్ తో ఆదిత్య గొంతు కోసి చంపాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. రక్తపు మరకలు అంటిని నిందితుడు చొక్కా, బ్లేడుని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

సోమవారం రెండు మూడు సార్లు ఆదిత్య, పదో తరగతి విద్యార్థిని మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. రాత్రి బాత్ రూమ్ కి తోడు వచ్చిన పదో తరగతి విద్యార్థి క్షనికావేశంతో బ్లేడ్ గొంతుకోసి ఆదిత్యని హతమార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. మరికొద్దిసేపట్లో ఈ కేసు వివరాలని మీడియాకు వివరించనున్నారు పోలీసులు. హాస్టల్ వార్డెన్ , సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. నిందితుడుకి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచనున్నారు.