విండీస్’కు గుండు కొట్టారు


విండీస్ టూర్ ని టీమిండియా ఘనంగా ప్రారంభించింది. టీ20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20లో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన విండీస్‌ 146/6కు పరిమితమైంది. పొలార్డ్‌ (58; 45 బంతుల్లో 1×4, 6×6) టాప్‌ స్కోరర్‌. పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ (3/4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

అనంతరం రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌; 42 బంతుల్లో 4×4, 4×6), విరాట్‌ కోహ్లి (59; 45 బంతుల్లో 6×4) బ్యాట్‌ ఝళిపించడంతో లక్ష్యాన్ని భారత్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది.