‘సాహో’ ప్రమోషన్స్.. ప్రభాస్ షెడ్యూల్ ఖరారు !

‘సాహో’ ఆగస్టు30కి రావడం పక్కా అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ దాదాపు పూర్తికావొస్తున్నాయ్. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టనుంది చిత్రబృందం. ఇందుకోసం స్వయంగా ప్రభాస్ రంగంలోకి దిగనున్నాడు. తొలివిడతగా అన్ని ప్రధాన నగరాల్లో ట్రైలర్ లాంచ్ వుంటుంది. అదే సమయంలో మీడియాలో ప్రభాస్ బ్రీఫ్ ఇంట్రాక్షన్ వుండనుంది.

ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆగస్టు10న ముంబైలో సాహో ట్రైలర్ విడుదల ఉండనుంది. ఈ సందర్భంగా ముంబై ప్రభాస్ మీడియాతో ముచ్చటించనున్నారు. ఆగస్టు 11న హైదరాబాద్ లో ట్రైలర్ విడుదల, ఆగస్టు12న చెన్నయ్ లో, ఆగస్టు13 కొచ్చిలో, ఆగస్టు14 న్యూ డిల్లీలో సాహో ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు ప్రభాస్. అంతేకాదు..
బెంగుళూరు, మరి కొన్ని ప్రాంతాలకు కూడా ప్రభాస్ వెళ్లనున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.

సాహో చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. రన్ రాజా రన్ తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించారు. నీల్ నితిన్ ముకేశ్ , అరుణ్ విజయ్ , మురళి శర్మ , వెన్నల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని దాదాపు రూ. 300కోట్లకిపైగా బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 30 సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.