బండ్ల గణేష్ పెద్ద దొంగ

బడా నిర్మాత బండ్ల గణేష్ దొంగగా మారాడు. ఇటీవల ట్రైన్ లో దొంగతనం చేస్తూ పట్టుబట్టాడు. చాన్నాళ్ల తర్వాత మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు. సినిమాలో కీలకమైన ట్రైన్ ఎపిసోడ్ లో హీరో, హీరోయన్లతో సహా బోలెడు మంది నటులు పాల్గొన్నారు. వీళ్లలో బండ్ల గణేష్ కూడా ఒకడు. బండ్ల చేస్తున్నది దొంగ క్యారెక్టర్ అని తెలుస్తోంది.

ట్రైన్ లో బండ్ల గణేష్ రావురమేష్ జేబు కొట్టేస్తాడు. ఆయనతో దెబ్బలు కూడా తిట్టాడట. సోడ్ తరువాత మళ్లీ క్లయిమాక్స్ లో జరిగే పెళ్లి ఎపిసోడ్ లో కూడా బండ్ల గణేష్ కనిపిస్తాడు. ఈ పెళ్లి ఎపిసోడ్ చిత్రీకరణ కేరళలో వుంటుంది. ఈ క్లయిమాక్స్ పెళ్లి ఎపిసోడ్ లో కూడా చాలామంది నటులు పాల్గొంటారని తెలుస్తోంది. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈరోజు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దీంతో ట్రైన్ సీన్ కి ఓ మూడు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు.