‘సాహో’ ట్రైలర్.. ఒక రేంజ్’లో ఉంది

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న సాహో ట్రైలర్ వచ్చేసింది. బాహుబలి’ తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఈ నేపథ్యంలో ‘సాహో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలని అందుకొనేలా సాహో ట్రైలర్ ఉంది.

రీసెంట్ గా ముంబైలో 2వేల కోట్ల రాబరి జరిగింది. అది చేసింది ఎవరో మనకు తెలీదు అనే వాయిస్ ఓవర్ తో వస్తూనే పోలీసుల ఉన్నాధికారుల సమావేశం చూపించారు. ఇది మనం సిగ్గుపడాల్సిన విషయమని పోలీస్ బాస్ ఆవేశంగా అనడం. ఇక నుంచి ఈ కేసుని ఒక అడర్ కవర్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తాడని చెప్పడంతో ప్రభాస్ స్టయిలీష్ ఎంట్రీని చూపించారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ కంటెంట్ తో ట్రైలర్ ని ఆకట్టుకొనేలా కట్ చేశారు.

“గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు. స్టేడియంలో కొట్టోడికో ఒక రేంజ్ ఉంటది” అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ చివర్లో ప్రభాస్ రక్తంతోనే స్నానం చేసినట్టు చూపించారు. బహుశా.. సినిమా క్లైమాక్స్ భీభత్సం ఉండబోతుందని హింట్ ఇవ్వడానికి ఇలా చేశారమో.. ! మొత్తానికి సాహో ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంది.