‘సాహో’ రేంజ్ తేలేది నేడే.. !


‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఈ నేపథ్యంలో ‘సాహో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఐతే, అంచనాలు అందుకొనేలా ఇప్పటి వరకు విడుదలైన సాహో ప్రచార వీడియోలు అనిపించలేదు. టీజర్ లో యాక్షన్ హైలైట్ గా చూపించారు. కానీ, కథ, ఎమోషన్స్ కనిపించలేదు. ఈ నేపథ్యంలో సాహో విషయంలో ఎక్కడో తేడా కొడుతుందనే కామెంట్స్ వినిపించాయి. ఐతే, ఇటీవల క్యూ కడుతున్న సాహో పోస్టర్స్ సినిమాపై నమ్మకాన్ని పెంచేలా ఉన్నాయ్.

సాహో రేంజ్ ఏంటన్నది మాత్రం ఈ సాయంత్రం విడుదల కానున్న ట్రైలర్ తోనే తేలనుంది. సాహో టీజర్, విలన్స్ పోస్టర్స్, స్టయిలీష్ లుక్స్, ఒకట్రెండు రొమాంటిక్ పోస్టర్ బాగున్నాయి అనిపించాయి. ఐతే, అది సరిపోదు. బాహుబలి రేంజ్ యాక్షన్, ఎమోషన్స్ కావాలి. వాటిని ట్రైలర్ లో రుచి చూపించనున్నారు. ట్రైలర్ లో అరవిరభయంకర విలన్స్ తో ప్రభాస్ పోరాటం చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ యాక్షన్ హాలీవుడ్ ని మించేలా ఉంటుందని చెబుతున్నారు. అది నిజమైతే.. సాహో పబ్లిసిటీ విషయంలో పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.

లేదంటే.. సాహో పై నెగటివ్ పబ్లిసిటీ స్టార్ట్ కావడం గ్యారెంటీ. అది సినిమా ఫలితంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. మొత్తానికి.. ట్రైలర్ తోనే సాహో స్థాయి ఏంటన్నది తేలిపోనుంది. ఈ సాయంత్రం 5గంటలకి సాహో ట్రైలర్ విడుదల కానుంది. ఆ సమయం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూడటమే. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్-శ్రద్దాకపూర్ జంటగా నటించారు. ఆగస్ట్ 30న సాహో విడుదల కానుంది.