గ్రేట్ : సావిత్రికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టాడు

నటనలో సావిత్రి ఓ శిఖరం. ఆమె ఎప్పుడూ నటించలేదు. సినిమాల్లోని పాత్రల్లోనూ ఆమె జీవించారు. జీవితంలోనూ తనకు ఇష్టమొచ్చినట్లే జీవించారు. మనసులో ఎలా ఉంటే అలాగే బయటికి నడుచుకునేవారు. సావిత్రి గొప్పనటి. కానీ, ఆమెకు జాతీయ అవార్డు రాలేదు. అంతేకాదు.. ఆమె తాగి చనిపోయిందని, ఏవేవో ఆమె జీవితంలో జరిగాయని… రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి. అలా కాకుండా.. ఆమెను గొప్పగా గుర్తుపెట్టుకోనేలా చేశాడు నాగ్ అశ్విన్.

సావిత్రి బయోపిక్ ‘మహానటి’కి జాతీయఅవార్డులని తెలుచుకొంది. ‘మహానటి’తో సావిత్రిని నేటి తరం గుండెల్లోనూ కొలువుదీర్చి… కీర్తిసురేశ్‌కు దేశంలోనే ఉత్తమ నటిగా గుర్తింపు తెప్పించిన దర్శకుడుగా నాగ్ అశ్విన్ చరిత్రకెక్కాడు. మహానటి అనిపించుకొన్న సావిత్రికి ఒక్కసారి కూడా జాతీయ అవార్డు రాలేదు. ఐతే, ఆమె జీవితకథకి మాత్రం జాతీయ అవార్డు రావడం విశేషం. ఇక, నాగ్ అశ్విన్ మూడో సినిమా వైజయంతీ మూవీస్‌ బ్యానర్ లోనే ఉండనుంది.