‘సాహో’ ప్రీమియర్ షో రద్దు ?

ఈ నెల 30న ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ఒకరోజు ముందే అంటే.. ఆగస్టు 29 రాత్రికే యుఎస్ లో ప్రీమియర్ షోస్ పడిపోతాయ్. దాంతో సినిమా టాక్ బయటికి వచ్చేస్తోంది. ట్విట్టర్ రివ్యూలు, పబ్లిక్ టాక్ లు వచ్చేస్తాయ్. ఐతే, ఆగస్టు 29 కంటే ముందే యుఎస్ లో ‘సాహో’ ప్రీమియర్ షోని భారీగా ప్లాన్ చేశారు డిస్ట్రిబూటర్స్. కొన్ని కారణాల వలన ఇప్పుడు ప్రీమియర్ షో క్యాన్సిల్ అయింది. మంచి లాజిక్ తోనే ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అయింది.

గత యేడాది శ్రీవిష్ణు నటించిన ఓ చిత్రంపై మంచి టాక్ వచ్చింది. రిలీజ్ కి ముందే వచ్చిన టాక్ తో చిత్రబృందం అత్యుత్సాహం చూపించింది. ఓ వారం రోజుల ముందే యుఎస్ లో ప్రీమియర్ షోస్ వేసింది. అక్కడ ప్లాప్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాని చూసేవారు కరువయ్యారు. అదే నేరుగా విడుదల చేసి ఉంటే మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ దక్కేవి. ఇప్పుడు సాహో ప్రీమియర్ షో క్యాన్సిల్ కావడానికి కూడా ఇదే కారణం. ఒకవేళ ప్లాప్ టాక్ వస్తే.. ఆ ప్రభావం అన్ని బాషల్లో, అన్నీ ఏరియాల్లో చూపిస్తుంది.

ఈ నేపథ్యంలోనే సాహో టాక్ అన్నీ బాషల్లో ఒకసారి బయటికొచ్చేలా ప్లాన్ చేశారు. అప్పుడు సినిమాకి డివైట్ టాక్ వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ సేఫ్ గా ఉంటాయని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ నటించింది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, అరుణ్‌ విజయ్‌లు కీలక పాత్రల్లో నటించారు. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది.