‘సాహో’ గేమ్ టీజర్ చూశారా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. సుజీత్ దర్శకుడు. దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్రబృందం. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో ఉందనే ప్రశంసలు దక్కాయి. ఇక సాహో గేమ్ రెడీ అవుతుందని గతంలోనే చిత్రబృందం తెలిపింది. ఇప్పుడు ఈ గేమ్ టీజర్ ని విడుదల చేసింది.

‘సాహో ది గేమ్’ పేరుతో డిజైన్ చేశారు. ‘ఎక్సిపీరియన్స్ విత్ యాక్షన్’ అనే లైన్ తో సాహో గేమ్ రుచి చూపించారు. ఓ పెద్ద భవనం.. దాని నుంచి ప్రభాస్ దూకి విలన్స్ ని నుంచి తప్పించుకొనే సీన్ ని గేమ్ లో చూడొచ్చు. నిజంగా గేమ్ లో యాక్షన్ అదిరిపోయింది. ఈ గేమ్ ని PixalotLabs డెవలెప్ చేసింది. ఆగస్టు 15న సాహో ది గేమ్ ని రిలీజ్ చేయబోతున్నట్టు టీజర్ లో తెలిపారు. ఈ గేమ్ తో సాహో చిత్రానికి మరింత పబ్లిసిటీ దక్కినటే.