వైరల్ : నిత్యామీనన్ హాటుగా.. !


బాలీవుడ్ కి వెఌతే పూర్తిగా పద్దతి మారిపోతుంది. పద్దతి మర్చిపోతారని చెబుతుంటారు. దక్షిణాది సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించిన కథానాయికలో బాలీవుడ్ కి వెళ్లేసరికి ఓపెన్ అయిన సందర్భాలున్నాయి. అందాలు ఆరబోసిన హీరోయిన్స్ ని చూశాం. ఇటీవలే బాలీవుడ్ లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ బ్రా అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అంతకుముందు అసిన్, పూజా హెగ్డే, తమన్నా తదితరులు ఇదే చేశారు.

ఇప్పుడీ జాబితాలో నిత్యామీనన్ కూడా చేరిపోయింది. ఆమె నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మింగల్’. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిత్యామీనన్ హాటు లుక్ లోకి మారిపోయింది. తన నిండైన అందాలకి తగ్గట్టుగా రెడ్‌ టాప్‌, బ్లూ జీన్‌ ధరించి ఫోటోలకి పోజులిచ్చింది నిత్యా. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు పద్దతిగా కనిపించిన నిత్యా.. ఫస్ట్ టైం గ్లామర్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఆమె అందాలని బాలీవుడ్ జనాలు ఫిదా కావడం ఖాయం. ఆ రేంజ్ లో ఉన్నాయి నిత్యా తాజా పోజులు. ఫొటోలు.

2013లో భారత్‌ చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ నేపథ్యంలో ‘మిషన్‌ మంగళ్‌’ తెరకెక్కింది. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషించారు. విద్యాబాలన్, నిత్యామేనన్, సోనాక్షిసిన్హా, తాప్సి తదితరులు నటించారు. జగన్‌శక్తి దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయనున్నారు.