‘మిషన్ మంగళ్’ రివ్యూ


బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘మిషన్ మంగళ్’. జగన్‌శక్తి దర్శకత్వం వహించారు. సోనాక్షి సిన్హా, విద్యాబాలన్, తాప్సి, నిత్యామీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 2013లో భారత్‌ చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రివ్యూని ముందే అందించారు తెలంగాణ సీనియర్ బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

ఆగస్టు 15 కానుకగా ‘మిషన్ మంగళ్’ ప్రేక్షకుల ముందుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలో సెలబ్రేటీల కోసం ఈ సినిమా స్పెషల్ షోని ప్రదర్శించారు. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా మిషన్ మంగళ్ ని వీక్షించారు. సినిమా చూసిన తర్వాత సినిమా గురించి తన ట్విట్టర్ ఖాతాలో గొప్పగా రాసుకొచ్చారు.

” మిషన్ మంగళ్ సినిమా ప్రీవ్యూ చూశా. సినిమా చాలా బావుంది. అద్భుతంగా తెరకెక్కించారు. ఇస్రో ఖ్యాతిని, మార్స్ మిషన్ ప్రాజెక్టు లో వారి కష్టాన్ని ఈ చిత్రాల్లో వర్ణించారు” అని కిషన్ రెడ్డి ట్విట్ చేశారు. అక్షయ్ కుమార్ తో పాటు ‘మిషన్ మంగళ్’ చిత్ర యూనిట్ తో ఉన్న కలిసి దిగిన ఫోటోలి కిషన్ రెడ్డి పంచుకొన్నారు. మొత్తానికి.. మిషన్ మంగళ్ సూపర్ హిట్ అని కిషన్ రెడ్డి ముందే చెప్పేశారు.