‘సాహో’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్.. గెస్ట్ ఎవరు ?

‘సాహో’ షో టైం దగ్గరపడుతోంది. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ఇటీవలే ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ అదిరిపోయింది.. హాలీవుడ్ రేంజ్ లో ఉందనే ప్రశంసలు దక్కాయి. ట్రైలర్’ని చూస్టే.. ‘సాహో’ అంచనాలని అందుకొనేలా కనబడింది. ఐతే, ఆ ప్రమోషన్ హీట్ ని ఏమాత్రం తగ్గకుండా చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది.

ఈ నెల 18న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఐతే, ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎవరిని తీసుకొస్తారు ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దర్శకధీరుడు రాజమౌళి కచ్చితంగా వస్తారు. ఆయనతో పాట్ ‘ఆర్.ఆర్.ఆర్’ కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు రావొచ్చు. వీరు కాకుండా బాలీవుడ్ నుంచి ఎవరినైనా గెస్ట్ గా తీసుకొస్తారా ? అన్నది చూడాలి.

సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ తెరకెక్కింది. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం దాదాపు రూ. 300కోట్లు ఖర్చు చేసింది యూవీ క్రియేషన్స్. బాహుబలి రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో సాహోని రిలీజ్ చేయనున్నారు. సాహో రాకతో ఇతర బాషల్లోనూ పెద్ద సినిమాలు పక్కకు జరిగాయి. దాన్ని సాహో క్యాష్ చేసుకోనుంది.