ప్రభాస్ ఎంట్రీ ఇచ్చేశారు

ప్రభాస్ ఎంట్రీ ఇచ్చేశారు. ప్రస్తుతం సాహో ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరుగుతోంది. ప్రభాస్ అభిమానులతో వేదిక కిక్కిరిసిపోయింది. ముందుగా బాహుబలి, సాహో పాటలకు డ్యాన్సర్స్ అదిరిపోయే స్టెప్పులేసి అభిమానులకి ఖుషి చేశారు. ఆ తర్వాత అతిథుల స్పీచులు ఆకట్టుకొన్నాయి. నిర్మాతలు దిల్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. తదితరులు ప్రభాస్ గురించి గొప్పగా చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు సుజీత్ మాట్లాడుతుండగా.. ప్రభాస్ విచ్చేశారు.

ప్రభాస్ వచ్చిన సమయంలో అభిమానులు కేకలు, అరుపులతో వేదిక మారుమ్రోగిపోయింది. టపాసులు పేల్చి ప్రభాస్ కి ఘన స్వాగతం పలికారు. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ప్రభాస్ చిరు నవ్వులు చిందిస్తూ ఎంట్రీ ఇచ్చారు. కూల్ గా జక్కన్నతో కలిసి తనకి కేటాయించిన సీటులో కూర్చున్నారు. వచ్చి రాగానే తన డై హార్ట్ ఫ్యాన్స్ కోసం సాహో సినిమాలోని ‘బ్యాడ్ బోయ్.. ‘ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఫంక్షన్ ఇంకా కొనసాగుతోంది. డార్లింగ్ స్పీచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.