సుజీత్’పై ప్రభాస్ వెటకారం మాటలు


‘సాహో’ విషయంలో ప్రభాస్ రిస్క్ చేశాడనే కామెంట్స్ వినిపించాయి. సాహో ట్రైలర్ వచ్చే వరకు ఇలాంటి కామెంట్స్ అక్కడక్కడ వినిపించాయి. ఐతే, ట్రైలర్ రాకతో ఈ కామెంట్స్ కి పులిస్టాప్ పడ్డాయి. ఎందుకంటే ? ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. అలాంటి ప్రభాస్ బాహుబలి తర్వాత సుజీత్ దర్శకత్వంలో సినిమా ఓకే చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అది కూడా భారీ బడ్జెట్ సినిమా. ఏకంగా రూ. 300కోట్ల సినిమా. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడు. కేవలం ఒకే ఒక్క సినిమా రన్ రాజా రన్ తీసిన అనుభవం ఉన్న సుజీత్ ని ప్రభాస్ ఎందుకు నమ్మినట్టు అనే చర్చ సుదీర్ఘంగా జరిగింది.

దీనిపై సాహో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రభాస్. ముందుగా సు.జీ.. త్ అంటూ కాస్త వెటకారంగా మొదలెట్టిన ప్రభాస్.. సుజీత్ టాలెంట్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. సాహో కథ చెప్పేటప్పుడు నెక్కరేసుకొని వచ్చాడు. రన్ రాజా రన్ సినిమా తీసినప్పుడు ఆయన వయసు 22యేళ్లు. ఐతే, సాహో కథని 40యేళ్లు ఉన్న వ్యక్తంగా అద్భుతంగా చెప్పాడు. సినిమా కోసం పని చేసిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ సుజీత్ కంటే వయసులో పెద్దోళ్లే. వాళ్లని చాలా కూల్ గా డీల్ చేశాడు. బహుశా.. సుజీత్ గ్రేటెస్ట్ డైరెక్టర్. ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోతాడేమోనన్నారు ప్రభాస్.