లైవ్ : ‘సాహో’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్

బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కూడా ఇదే. సుజీత్‌ దర్శకత్వం వహించారు. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదారబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభం అయింది. ఇప్పటికే వేదిక అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకి హాజరుకాబోతున్నారు. సాహో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ని మీరు లైవ్ లో చూసేయండీ.. !