బన్నీ మెచ్చిన ‘ఎవరు’


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్’ది గొప్ప మనసు. ఆయన తోటీ హీరోల సినిమాలు బాగా ఆడాలని ఆకాంక్షిస్తుంటారు. సినిమా బాగుంటే దర్శకుడుకి ఫోన్ చేసి అభినందిస్తారు. లేదంటే ట్విట్ చేస్తారు. ఇంకా బాగా నచ్చితే ఆ చిత్రబృందాన్ని ఇంటికి ఆహ్వానించి మరీ పార్టీ ఇస్తారు. గతంలో మహానటి, గీత గోవిందం.. సినిమాల చిత్రబృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే

తాజాగా అడివి శేష్ ‘ఎవరు’ చిత్రాన్ని బన్నీ మెచ్చారు. ఆదివారం బన్నీ ‘ఎవరు’ సినిమాని చూశారు. వెంటనే చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ట్విట్ చేశారు. “ఎవరు టీం మొత్తానికి అభినందనలు. గతరాత్రి ఈ సినిమాను చూశాను. ఇది ట్విస్టులు, టర్న్‌లుతో కూడిన అద్భుతమైన మర్డర్ మిస్టరీ. నిజంగా సినిమా చాలా బాగుంది. కథ-కథనం, సాంకేతిక విలువలు అద్భుతం. శేష్ వరుసగా చాలా మంచి సినిమాలను అందిస్తున్నారు. దీన్ని కచ్చితంగా హ్యాట్రిక్ అని చెప్పాలి. రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ గారు, ఇతర నటీనటులు అద్భుతంగా నటించారు. పీవీపీ గారికి, కెప్టెన్ వెంకట్ రామ్‌జీకి అభినందనలు” అని రాసుకొచ్చారు.

బన్నీ ట్విట్ కు అడవిశేష్ రిప్లై ఇచ్చారు. “ప్రియతమ సోదరుడు అల్లు అర్జున్, మీ ప్రోత్సాహంతో ‘క్షణం’ సినిమాను లక్షలాది మంది ప్రజలకు చేరువయ్యేలా చేశారు. మళ్లీ ఇప్పుడు ‘ఎవరు’ సినిమాను సపోర్ట్ చేశారు. మీ ప్రోత్సాహం కారణంగా మా సినిమా ఇప్పుడు మీ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది ప్రేక్షకులకు చేరువవుతుంది. ఒక సోదరుడిలా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు” అని శేష్ రీ-ట్వీట్ చేశారు.

‘ఎవరు’ చిత్రానికి కొత్త దర్శకుడు వెంకట్ రామ్ జీ దర్శకత్వం వహించారు. పీవీపీ బ్యానర్ నిర్మించింది. ఆగస్టు15న శర్వానంద్ ‘రణరంగం’తో పోటీ పడిన ఎవరు హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది.