‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్ టాక్

భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. తమిళ్ హిట్ ‘కణా’కి రిమేక్ ఇది. ఈ చిత్రాన్ని కె ఏ వల్లభ నిర్మించారు. ఆగస్టు 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఓ గ్రామీణ యువతి జాతీయ మహిళా క్రికెటర్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ తో అర్థమవుతోంది. ఇక ట్రైలర్ లో డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.

‘గవాస్కర్, సచిన్ లాంటి వాళ్లు కొడుకులను క్రికెట్ లోకి పంపారు. కానీ, కూతుళ్లను పంపారా?’

‘ఈ లోకం గెలుస్తానని చెబితే వినదు. కానీ గెలిచినవాళ్లు చెబితే వింటుంది. నువ్ ఏమీ చెప్పినా గెలిచి చెప్పు’ అనే డైలాగ్స్ బాగా పేలాయ్.