పిక్ ఆఫ్ ది డే : ముంబైలో చిరు-ప్రభాస్-చరణ్

తెలుగు సినిమా బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ సందడి చేసింది. టాలీవుడ్ నుంచి వరుసగా రెండు భారీ సినిమాలొస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి ప్రభాస్ ‘సాహో’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లారు ప్రభాస్. బాలీవుడ్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ సాహోని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఇక, మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ముంబైలో టీజర్ రిలీజ్ వేడుకని గ్రాండ్ గా నిర్వహించారు. ఇక సాహో ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉన్న ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి బాలీవుడ్ లో తెలుగు సినిమా హవా మొదలైందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

సైరా టీజర్ రిలీజ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పాటు రామ్ చరణ్, సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా, అమిత్ త్రివేది తదుపరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు.. “భారతీయులంతా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా చేయాలనుకున్నా. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా చేయలేకపోయాను. చివరకు రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిల కారణంగా ఈ సినిమా చేయగలిగా.. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి రావడం కరెక్ట్ అనిపించింది” అన్నారు.