బాలీవుడ్ లో ‘సైరా’ సందడి మొదలు


సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా టీజర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్ రిలీజ్ లాంచ్ ని ముంబై లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పాటు రామ్ చరణ్, సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా, అమిత్ త్రివేది తదుపరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. “భారతీయులంతా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా చేయాలనుకున్నా. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా చేయలేకపోయాను. చివరకు రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిల కారణంగా ఈ సినిమా చేయగలిగా.. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి రావడం కరెక్ట్ అనిపించిందన్నారు.